యాదగిరిగుట్టలో రూ.45కోట్లతో 100 పడకల ఆసుపత్రి
టీ మీడియా, ఫిబ్రవరి 16, యాదాద్రి : సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా యాదగిరిగుట్టలో ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. యాదగిరిగుట్టలో గురువారం రూ.45కోట్లతో 100 పడకల ఆసుపత్రికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. జిల్లాలో ఇప్పటికే పలు 100 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేశామని, త్వరలోనే యాదాద్రి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు.తెలంగాణలో త్వరలో మరో తొమ్మిది కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణలో ఇప్పటి వరకు 81వేల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు విడుదల చేశామని తెలిపారు.
Also Read : నిద్రించే ముందు మీ తల దగ్గర ఈ వస్తువులను ఉంచుకుంటే..
యాదాద్రి దేవాలయం నిర్మాణం చరిత్రలో అద్భుతంగా చేపట్టామన్నారు. 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, నల్గొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మెన్ సందీప్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube