ట్విట్టర్‌కు 1,200 మంది గుడ్‌బై

ట్విట్టర్‌కు 1,200 మంది గుడ్‌బై

1
TMedia (Telugu News) :

ట్విట్టర్‌కు 1,200 మంది గుడ్‌బై

టీ మీడియా, నవంబర్ 21, శాన్‌ఫ్రాన్సిస్కో : ట్విట్టర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌కు ఉద్యోగులు ఝలక్‌ ఇచ్చారు. ఏకంగా 1,200 మంది తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి సంస్థలో పలు మార్పులకు తెర లేపిన మస్క్‌.. ఉద్యోగులంతా కష్టపడి పనిచేయాలని, రోజుకు 12 గంటల చొప్పున వారానికి 80 గంటలైనా పనిచేయాలని స్పష్టం చేశారు. దీనిపై లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని తేల్చి చెప్పారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ భారీ సంఖ్యలో ఉద్యోగులు ట్విట్టర్‌కు రాజీనామా చేశారు.

Also Read : లారీ బీభత్సం.. 47 వాహనాలు ఢీ..

వీరిలో ఎక్కువ మంది టెక్‌ విభాగానికి చెందిన ఉద్యోగులే ఉన్నట్టు తెలుస్తున్నది. దీంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన మస్క్‌.. ఉద్యోగులకు అత్యవసర ఈ-మెయిల్స్‌ పంపారు. సంస్థలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లంతా ఆదివారం మధ్యాహ్నం 2 గంటల్లోగా శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube