1న చెస్ టోర్నమెంట్

1న చెస్ టోర్నమెంట్

0
TMedia (Telugu News) :

                     1న చెస్ టోర్నమెంట్

 

టీ మీడియా ఏప్రిల్ 28,కొమరంభీం ఆసిఫాబాద్‌ :జిల్లా రెబ్బెన మండలం గోలేటిలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో మే 1న నిర్వహించే చెస్ టోర్నమెంట్‌ను క్రీడాకారులు విజయవంతం చేయాలని బెల్లంపల్లి ఏరియా జీఎం దేవేందర్ కోరారు. గురువారం జిల్లా చెస్ అసోసియేషన్ సభ్యులు ఏరియా జనరల్ మేనేజర్ను కలిసి టోర్నమెంట్కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కోట సుధాకర్ మాట్లాడుతూ టోర్నమెంట్కు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన క్రీడాకారులు హాజరవుతారని తెలిపారు. అండర్ 9, 11, 13, 15 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. మూడు ఉమ్మడి జిల్లాలకు చెందిన క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు బోగే ఉపేందర్, కోశాధికారి మల్లేశ్, ఈసీ సభ్యులు ఎం. తిరుపతి పాల్గొన్నారు

AlsoRead:పోస్టాఫీసులలో ఉచితంగా పెన్షన్ డబ్బులు తీసుకునే అవకాశం

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube