టీ మీడియా, జనవరి 18, ఖమ్మం :తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్తో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ జాతీయ నేత డీ రాజా ప్రారంభోత్సవం చేశారు. అంతకు ముందు యాదాద్రి నుంచి హెలీకాప్టర్లలో ఖమ్మం చేరుకున్న ముఖ్యమంత్రులు, జాతీయ నేతలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి ఖమ్మం కలెక్టరేట్కు చేరుకున్నారుసీఎం కేసీఆర్కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ గురించి జాతీయ నేతలకు సీఎం కేసీఆర్ వివరించారు. ఆ తర్వాత కలెక్టరేట్ శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం చాంబర్లో కలెక్టర్ వీపీ గౌతమ్ను కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు.
కేరళకు చెందిన ఖమ్మం కలక్టర్ ని కేరళ సి ఎం కి కెసిఆర్ పరిచయం చేసారు’…..
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube