చెట్టును ఢీకొట్టిన యాత్రికుల వ్యాన్.. 10 మంది మృతి
చెట్టును ఢీకొట్టిన యాత్రికుల వ్యాన్.. 10 మంది మృతి
చెట్టును ఢీకొట్టిన యాత్రికుల వ్యాన్.. 10 మంది మృతి
టి మీడియా, జూన్ 23,లక్నో: ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న మినీ వ్యాన్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో 10 మంది యాత్రికులు మరణించారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
Also Read : హోటల్లో శివసేన రెబల్స్..
వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మొత్తం 18 మంది హరిద్వార్లో స్నానం చేసి తిరిగివెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube