కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం
-ఐదుగురు భారతీయులు మృతి
టీ మీడియా, మార్చి 14,ఒట్టావా: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భారత్కు చెందిన ఐదుగురు యువకులు మృత్యువాతపడగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ విషయాన్నిభారత హైకమిషనర్ అజయ్ బిసారియా సోమవారం ట్విట్టర్ వేదికగా ధృవీకరించారు.
వివరాల ప్రకారం.. కెనడాలోని ఒంటారియోలో శనివారం ఉదయం హైవే-401పై ప్యాసింజర్ వ్యాన్లో భారత్కు చెందిన విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో ఓ ట్రాక్టర్.. వారు ప్రయాణిస్తున్న వ్యాన్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు భారతీయులు మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. కాగా, మరణించిన విద్యార్థులను హర్ప్రీత్ సింగ్, జస్పిందర్ సింగ్, కరణ్పాల్ సింగ్, మోహిత్ చౌహాన్, పవన్ కుమార్లుగా గుర్తించారు.
Also Read : వాహనాని కి 15 ఏళ్ళు దాటితే
ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తూ.. అజయ్ బిసారియా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విద్యార్థుల మృతిపై తాజాగా భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్, జైశంకర్ స్పందిస్తూ.. చనిపోయిన విద్యార్థులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.