లారీ బీభత్సం.. 47 వాహనాలు ఢీ..

లారీ బీభత్సం.. 47 వాహనాలు ఢీ..

1
TMedia (Telugu News) :

లారీ బీభత్సం.. 47 వాహనాలు ఢీ..

టీ మీడియా, నవంబర్ 21, పుణె : మహారాష్ట్రలోని పుణెలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. పుణె-బెంగళూరు రహదారిపై నవ్‌లే బ్రిడ్జి వద్ద ఆదివారం రాత్రి 9గంటల సమయంలో ఆయిల్‌ ట్యాంకర్‌ లారీ అతి వేగంతో వాహనాలపై దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 47 వాహనాలు ధ్వంసమయ్యాయి. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. లారీ బ్రేక్స్‌ ఫెయిల్‌ అవ్వడంతో అదుపుతప్పి ముందున్న వాహనాలపైకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో లారీలోని ఆయిల్‌ రోడ్డుపై పడటంతో పలు వాహనాలు అదుపుతప్పి ఒకదానికొకటి ఢీ కొన్నాయి.

Also Read : ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లిన గూడ్స్ రైలు..

ఈ ఘటనలో దాదాపు 38 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పుణె ఫైర్‌ బ్రిగేడ్‌, పుణె మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ రెస్క్యూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube