రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
– ఏడుగురికి గాయాలు
టీ మీడియా, నవంబర్ 22, లక్నో : ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలవగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. క్షతగాత్రులను ఆసుప్రతికి తరలించారు. లఖింపూర్ ఖేరిలోని పాలియా తహసీల్ ప్రాంతంలోని భీరామార్గ్లో రోడ్డు పక్కనే ఉన్న గుంత వద్ద ఎస్యూవీ బోల్తాపడింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 12 మంది ఉన్నారని, ఇందులో ఐదుగురు మృతి చెందారని పోలీసులు పేర్కొన్నారు.
Also Read : 16 ఏళ్లకే ఓటు హక్కు.. కొత్త చట్టం
పలియా వద్ద రోడ్డు కోతకు గురైందని, ఈ సమయంలో డ్రైవర్ నిద్రపోయాడా?.. అతని పరిస్థితి ఎలా ఉందో? ప్రమాదంలో బయటపడ్డ ఓ వ్యక్తి పేర్కొన్నారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు, పోలీసులు జేసీబీ సహాయంతో వాహనాన్ని బయటకు తీసి సహాయక చర్యలు చేపట్టారు. ఎస్డీఎం కార్తికేయ సింగ్ కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube