మహిళలను ఢీకొట్టిన వాహనం.. ఐదుగురు మృతి
టీ మీడియా, ఫిబ్రవరి 14, మహారాష్ట్ర : మహారాష్ట్రలోని పుణెలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. నాసిక్ – పుణే హైవేపై వేగంగా రోడ్డు దాటుతున్న మహిళలను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శిరోలి గ్రామ శివారులో ఈ దుర్ఘటన జరిగింది. దాదాపు 17 మంది మహిళల బృందం హైవేను దాటేందుకు యత్నిస్తున్నది. వీరంతా హైవేకి అవతలి వైపు ఉన్న కల్యాణ మండపంలో క్యాటరింగ్ కోసం వెళ్తున్నారు. క్రమంలో పుణే వైపు నుంచి వేగంగా వచ్చిన ఎస్యూవీ మహిళలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఐదుగురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయగా..
Also Read : మాదిగ జర్నలిస్టులందరికీ ఇండ్లు స్థలాలు మంజూరు చేయాలి
మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఎస్యూవీ డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube