మంత్రి సత్యవతి కాన్వాయ్కు తృటిలో తప్పిన ప్రమాదం..
మంత్రి సత్యవతి కాన్వాయ్కు తృటిలో తప్పిన ప్రమాదం..
మంత్రి సత్యవతి కాన్వాయ్కు తృటిలో తప్పిన ప్రమాదం..
టి మీడియా, మే 6,మరిపెడ: గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథ్డ్ కాన్వాయ్కు తృటిలో ప్రమాదం తప్పింది. మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ 7వ తేదీన మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలించేందుకు హైదరాబాద్ నుంచి మంత్రి సత్యవతి మహబుబాబాద్ వెళ్తున్నారు.
Also Read : శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరగాలి
ఈ క్రమంలో జిల్లాలోని మరిపెడ కార్గిల్ స్తూపం ప్రాంతంలో మంత్రి వాహన శ్రేణికి పందుల గుంపు అడ్డువచ్చింది. దీంతో ఎస్కార్ట్ వాహనాలకు ఒకదానికి ఒకటి ఢీ కొట్టుకోవడంతో గన్మెన్లకు స్వల్ప గాయాలయ్యాయి. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube