ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఆటో

- నలుగురు దుర్మరణం

0
TMedia (Telugu News) :

ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఆటో

– నలుగురు దుర్మరణం

టీ మీడియా, అక్టోబర్ 9, కడప : ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి సమీపంలో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ప్రొద్దుటూరు, కడపకు చెందిన 11 మంది ప్రొద్దుటూరు నుంచి మల్లెలకు ఆటోలో వెళ్తున్నారని, ఈ క్రమంలో లారీని క్రాస్‌ చేయబోతుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఆటో ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు.

Also Read : ఓటమి భయంతోనే ఇడి దాడులు

ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయని చెప్పారు. మృతులను మహమ్మద్, హసీనా, అమీనా, షాకీర్‌గా గుర్తించామన్నారు. ఈ ఘటనపై కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube