కాంగ్రెస్ ప్రచారాల్లో దూసుకుపోతున్న కార్యకర్తలు
టీ మీడియా, నవంబర్ 15, దమ్మపేట : భద్రాద్రి కొత్తగూడెం దమ్మపేట మండలం గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో దూసుకుపోతున్న జారే ఆదినారాయణ. ఈ కార్యక్రమంలో మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేసు మణి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఆరు గ్యారెంటీలను గూర్చి ఇంటింటి ప్రచార కార్యక్రమంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల కరెంటు ఉచితం అని తెలిపారు రైతులకు 15 వేల రూపాయల రైతు భరోసా కౌలు రైతులకు 12 వేల రూపాయల సహాయం మరియు విద్యార్థులకు నిరుద్యోగ భృతి ఇందిరమ్మ ఇళ్ల క్రింద 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇళ్ల స్థలాలు లేని వారికి ఇంటి స్థలాలు మంజూరు ఆరోగ్యశ్రీ వంటి పథకాలను గూర్చి వివరించారు. జారే ఆదినారాయణ లాంటి విద్యావంతుడైన యువకుడైన పోరాట యోధుడైన నాయకుడు అశ్వరావుపేట నియోజకవర్గానికి అవసరమని తెలిపారు.
Also Read : ఉదారతన చాటుకున్న ఎంపీ మాలోతు కవిత
ఈ కార్యక్రమంలో గంగాధర్ రావు చిన్నంశెట్టి యుగంధర్, గోపి శాస్త్రి, చిట్టి బాబు, మహిళా కాంగ్రెస్ కమిటీ సభ్యులు గాంధీ, నిర్మల, దేవి, కార్యకర్తలు అభిమానులు పాల్గొని జారీ ఆదినారాయణ హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube