నేడు తెలంగాణలో అమిత్ షా పర్యటన
టీ మీడియా, అక్టోబర్ 9, న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. బీజేపీ అగ్రనేతలు వరుసగా తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. మొన్న ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పాటు.. తెలంగాణ రాష్ట్రంలో పర్యటించారు. ఇక ఇప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఆదిలాబాద్ లో నిర్వహించనున్న జనగర్జన సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొంటారు. ఎన్నికల షెడ్యూల్ తర్వాత అమిత్ షా తెలంగాణలో మొదటి సారి పర్యటించనున్నారు. అనంతరం హైదరాబాద్ లో మేధావులతో సమావేశం కానున్నారు.
Also Read : టిటిడి పారిశుధ్య కార్మికులకు జీతాలు పెంపు : టిటిడి ఛైర్మన్
బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశముంది. ఎన్నికల వ్యూహాలపై అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube