టీ మీడియా అశ్వారావుపేట డిసెంబర్ 22
మండలంలోని గుర్రాలచెర్వు గ్రామ పంచాయితీ గురాలచెర్వు గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రం లో టీచర్ గా పనిచేస్తున్న కాగితపు రంగ 35 సంవత్సరాలు బుధవారం అశ్వారావుపేట లోని మధ్యాహ్నం తన నివాసంలో పిల్లలు,భర్త లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరి వేసుకుని ఉంటుందని, తరుచు భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతుంటాయి అని వీరి ఇరువురు 15 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారని వీరికి ఇద్దరు ఆడపిల్లలు అని ఇద్దరు అశ్వారావుపేట జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకుంటున్నారని స్థానికులు తెలిపారు.భర్త తాపీ పనిచేస్తుంటాడాని వారు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube