ఆప్కి మరో ఎదురుదెబ్బ
టి మీడియా, ఫిబ్రవరి 11, న్యూఢిల్లీ : ఢిల్లీలోని అధికార పార్టీ ఆప్కి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గత కొన్నిరోజులుగా ఆప్ ప్రభుత్వానికి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సెనాకు మధ్య తీవ్రస్థాయిలో విబేధాలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లెఫ్టినెంట్ గవర్నర్ తాజాగా ఆప్ కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రయివేటు డిస్కమ్ల బోర్డు సభ్యులుగా ఉన్న ఆప్ అధికార ప్రతినిధి జాస్మిన్ షా, ఆప్ ఎంపి ఎన్డి గుప్తా కుమారుడు నవీన్ ఎన్డి గుప్తాలను తొలగించారు. గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయం రాజ్యాంగానికి, చట్టానికి విరుద్ధమని ఆప్ ప్రభుత్వం మండిపడుతోంది. విద్యుత్పై ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఎన్నికైన ప్రభుత్వానికే ఉంటుందని, గవర్నర్కి ఉండదని ఆప్ విమర్శిస్తోంది. గవర్నర్ సక్సేనా సుప్రీంకోర్టు ఆదేశాలను తోసిపుచ్చుతున్నారని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆప్ ఆరోపించింది.కాగా, బివైపిల్, బిఆర్పిల్ (అనీల్ అంబానీ), ఎన్డిపిడిసిఎల్ (టాటా) బోర్డుల్లో ప్రభుత్వ నామినీలుగా ఉన్న జాస్మిన్, నవీన్ గుప్తా.. రాష్ట్ర ఖజానా ఖర్చుతో ప్రైవేటు డిస్కమ్లకు ఆర్థిక ప్రయోజనాలను అందించారని విద్యుత్ బోర్డు ప్రధాన కార్యదర్శి అందించిన నివేదిక ఆధారంగా లెఫ్టినెంట్ గవర్నర్ బోర్డు సభ్యులుగా ఉన్న వారిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Also Read : శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి బండ ప్రకాశ్ నామినేషన్
అలాగే అనీల్ అంబానీ యాజమాన్యంలోని డిస్కమ్ల బోర్డులలో జాస్మిన్, నవీన్ గుప్తా ప్రైవేట ప్రతినిధులకు సహకరించి.. 8 వేల కోట్ల మేర ప్రయోజనం చేకూర్చారని లెఫ్టినెంట్ గవర్నర్ పేర్కొన్నారు. ఇక ఆ ఇద్దరి బోర్డు సభ్యుల స్థానంలో వేరొకరిని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నామినేట్ చేసేంతవరకు సీనియర్ ప్రభుత్వ అధికారులను నియమించడం ఆనవాయితీ అని గవర్నర్ సక్సేనా తెలిపారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube