గౌరీశంకర్ ఆలయంపై యాంటీ ఇండియా గ్రాఫిటీ..
లహరి, జనవరి 31, టొరంటో : కెనడాలోని బ్రాంప్టన్లో ఉన్న హిందూ ఆలయంపై భారత్కు వ్యతిరేకంగా గ్రాఫిటీ వేశారు. దీంతో అక్కడి భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గౌరీశంకర్ మందిరంపై గ్రాఫిటీ వేసిన ఘటనను ఖండిస్తున్నట్లు టొరంటోలోని భారతీయ కౌన్సులేట్ జనరల్ పేర్కొన్నారు. కెనడాలో ఉన్న భారతీయుల మనోభావాలను దెబ్బతీసినట్లు కౌన్సులేట్ జనరల్ ఒక ప్రటకనలో తెలిపారు. బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ కూడా ఈ ఘటనను ఖండించారు. కెనడా అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. విద్వేషపూరిత చర్యలకు ఈ దేశంలో స్థానం లేదన్నారు.
Also Read : స్తంభాల్లోనే కాదు.. రాళ్లలోనూ సంగీత ధ్వనులు..
ప్రార్థనా స్థలం వద్ద ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలన్నదే తమ ఉద్దేశమని మేయర్ తెలిపారు. కెనడాలో ఆలయాన్ని ధ్వంసం చేయడం ఇదే తొలిసారి కాదు. 2022 సెప్టెంబర్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నది. స్వామినారాయణ్ మందిర్ను యాంటీ ఇండియా గ్రాఫిటీతో ఖలిస్తాన్ తీవ్రవాదులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube