మృతి చెందిన రైతుల కు భీమా కొరకు దరఖాస్తు
టీ మీడియా, జనవరి 20, మహబూబ్ నగర్ బ్యూరో : అడ్డకుల మండల కందూరు గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన చాకలి శ్రీనివాసులు , చౌడాయపల్లి కి చెందిన చిన్న అంజన్న గౌడ్ నామిని లకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా రైతు భీమా పథకం ద్వారా 5 లక్షల రూపాయలులబ్ది కోసం దరఖాస్తులను గ్రామపంచాయతీ నందు ఏఈఓ ప్రవీణ్ స్వీకరించటం జరిగినది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీకాంత్,ఎంపీటీసీ శ్యామలమ్మ, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీని వాస్ రెడ్డి, పెర్కి శ్రీనివాస్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.