వైభవంగా ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

- టీటీడీ జేఈవో

0
TMedia (Telugu News) :

వైభవంగా ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

– టీటీడీ జేఈవో

 

లహరి, ఫిబ్రవరి 4, తిరుపతి : కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేయాలని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. మార్చి 30న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ , 31న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని వివరించారు. శ్రీ కోదండరామ స్వామి కల్యాణానికి అవసరమైన తలంబ్రాల తయారీని ఎప్పుడు ప్రారంభించాలనే అంశంపై అధికారులతో చర్చించారు. బ్రహ్మోత్సవాలకు డిప్యూటేషన్ మీద నియమించే అధికారులు, ఉద్యోగులతో పాటు శ్రీవారి సేవకులకువసతి ఆహారం ఏర్పాట్లపై ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. స్వామివారి కల్యాణానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు అన్నప్రసాదాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.

Also Read : విరబూసిన స్వర్ణకమలం విశ్వనాధం : నామ

భక్తులకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించడానికి విరివిగా మజ్జిగ తాగునీరు పంపిణీ చేయడానికి అవసరమైన కౌంటర్లు సిద్ధం చేసుకోవాలన్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని భద్రత, పార్కింగ్ ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఆలయం, కల్యాణ వేదిక వద్ద భక్తులను ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, విద్యుత్ అలంకరణలు చేయాలన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube