భారతీయుడిపై కాల్పులు జరిపిన ఆస్ట్రేలియా పోలీసులు
టీ మీడియా, మార్చి1, న్యూఢీల్లి : ఆస్ట్రేలియా లో ఓ భారతీయుడిని అక్కడి పోలీసులు కాల్చి చంపారు. తమిళనాడుకు చెందిన మహమ్మద్ రహమతుల్లా సయ్యద్ అహ్మద్ (32) బ్రిడ్జింగ్ వీసాపై ఆస్ట్రేలియాలో నివసిస్తున్నాడు. మహమ్మద్ సిడ్నీ రైల్వే స్టేషన్లో ఓ క్లీనర్ను కత్తితో పొడిచాడు. అనంతరం పోలీసు స్టేషన్కు వెళ్లి అక్కడి కానిస్టేబుళ్లతో గొడవకు దిగాడు.ఈ తరుణంలో ఆగ్రహించిన పోలీసులు అధికారి అహ్మద్పై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. అందులో రెండు అహ్మద్ ఛాతీలోకి దూసుకెళ్లాయి. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
Also Read : మీ ఆఫీసులో ఈ వాస్తు మార్పులు చేస్తే చాలు.
ఈ ఘటనపై ఆస్ట్రేలియాలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని విచారం వ్యక్తం చేసింది. విదేశీ వ్యవహారాలు, వాణిజ్య విభాగంతోపాటు పోలీసు అధికారుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తామని తెలిపింది. ఈ విషయాలను స్థానిక మీడియా తెలిపింది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube