ప్రభుత్వాల పథకాలపై అవగాహన సదస్సు
టీ మీడియా,జూలై22, జగిత్యాల ప్రతినిధి:
కొడిమ్యాల మండల పరిధిలోని గౌరాపూర్ గ్రామంలో ఇండియన్ బ్యాంక్, పూడూర్ శాఖ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు బ్యాంకుల ద్వారా రూపొందించిన వివిధ పథకాల గురించి అవగాహన కల్పించారు. అంతేకాకుండా ఇప్పటి వరకు బ్యాంకు ఖాతా లేని వారికి జన్ ధన్ యోజన పథకం కింద జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరవడంతో పాటుగా ప్రధాన మంత్రి జీవన జ్యోతి భీమా యోజన, సురక్షా భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాల గురించి వివరించి సుమారు 200 మంది గ్రామస్తులకు భీమా చేయించడం జరిగింది.
Also Read : ఒంటరి మహిళల కు భరోసా
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి బొడ్డు విజయలక్ష్మి రమేష్, ఇండియన్ బ్యాంక్ పూడూర్ మేనేజర్ మోతీలాల్, జిల్లా లీడ్ బ్యాంక్ ఆర్థిక అక్షరాస్యత కౌన్సిలర్ కోట. మధు సూదన్, అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాస్ , పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, సిఎ శ్రీదేవి, దేవయ్య, రఘుతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube