ర్యాగింగ్ కు దూరంగా ఉంటే భవిష్యత్తు బంగారం
– రూరల్ ఎస్సై నరేష్
టీ మీడియా, నవంబర్ 21, మధిర : మండల పరిధిలోని కాజీపురం పాలిటెక్నిక్ కళాశాలలో ఈరోజు రూరల్ ఎస్సై నరేష్ విద్యార్థులకు ర్యాగింగ్ పై అవగాహన కార్యక్రమం కల్పించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించాలి అని, సీనియర్ స్టూడెంట్స్ జూనియర్ విద్యార్థులకు చదువుకు సంబంధించిన సూచనలు చేయాలని,ర్యాగింగ్ దూరంగా ఉండాలని సూచన చేశారు.కళాశాలకు కొత్తగా వచ్చిన విద్యార్థులకు మనస్థాపం కలిగించే రీతిలో ప్రవర్తించకూడదన్నారు.
Also read : మందుల కిట్ల పంపిణీ
కొంతమంది విద్యార్థులు సున్నిత మనస్ఫస్తులై ఉంటారని, ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితిలో నెలకొంటాయన్నారు. ర్యాగింగ్ చేయడం చట్ట విరుద్ధమన్నారు. చదువు పట్ల శ్రద్ధ వహిస్తే భవిష్యత్తు బంగారం అవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube