పోలీసులు దౌర్జన్యంఖండిస్తున్నా బండి సంజయ్
టీ మీడియా,జూన్ 13,హైదరాబాద్: సిద్దిపేట జిల్లాలో గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ పేరిట ప్రజల పట్ల పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించారని.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. చిన్నాపెద్దా, మహిళలనే తేడా లేకుండా పోలీసులు దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా.. నిర్వాసితులను ఆదుకోకుండా ఏళ్ల తరబడి సమస్యను నాన్చుతూ కాలయాపన చేయడం అన్యాయమన్నారు. అర్ధరాత్రి పోలీసులు దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని.. దీనిపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. నిర్వాసితులను పూర్తిగా ఆదుకున్న తర్వాతే గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ పనులు ప్రారంభించాలన్నారు. ఈ విషయంలో నిర్వాసితుల తరఫున భాజపా పోరాడుతుందని ఆయన చెప్పారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube