బిజెపి పరువు పోయింది : సినీనటి విజయశాంతి
టీ మీడియా, నవంబర్ 18, హైదరాబాద్ : ” బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి సంజయ్ ను తొలగించవద్దని కోరాం. సంజయ్ ను తొలగించడంతో బిజెపి పరువు పోయింది ” అని విజయశాంతి ధ్వజమెత్తారు. శనివారం గాంధీభవన్లో సినీనటి విజయశాంతి మాట్లాడుతూ … మళ్లీ కాంగ్రెస్లోకి రావడం సంతోషంగా ఉందని అన్నారు. కెసిఆర్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని బిజెపి చెబితే ఆ పార్టీలోకి వెళ్లానని అన్నారు. ఏళ్లు గడచినా ఆ మేరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఆధారాలు ఉండి కూడా బిజెపి ఎందుకు చర్యలు తీసుకోలేదు ? అని ప్రశ్నించారు. బిజెపి, బిఆర్ఎస్ రెండూ ఒక్కటేననీ.. తెరపై విమర్శలు.. తెర వెనుక ఒప్పందాలు చేసుకున్నాయని వ్యాఖ్యానించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి సంజయ్ ను తొలగించవద్దని కోరామనీ.. సంజరును తొలగించడంతో బిజెపి పరువు పోయిందని విజయశాంతి దుయ్యబట్టారు.
Also Read : రాజస్థాన్లో మైనార్టీ డిక్లరేషన్ ఎందుకివ్వడం లేదు
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube