నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం
– నేస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు నరేష్ యాదవ్
టీ మీడియా, నవంబర్ 2, వనపర్తి బ్యూరో : తల సేమియాతో భాధపడుతున్న చిన్నారుల కోసం యువకులు ముందుకు వచ్చి స్వచ్చందంగా రక్తదానం చేయాలి.ఈ తలసేమియా చిన్నారులకు ప్రతి నెలకు ఒక్కసారి రక్తం ఎక్కించల్సిన అవసరం ఉంటుంది. ఈ సందర్భంగా తిప్పడం పల్లి గ్రామ యువకులు, పెద్దలు ఆ చిన్నారుల కోసం నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి 35 మంది యువకులు స్వచ్చందంగా రక్తదానం చేశారు. రక్తదాతలకు నేస్తం ఫౌండేషన్ కృతజ్ఞతలు తెలియజేశారు.తలసేమియా చిన్నారులకు యువకులు అండగా ఉండాలని నేస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు నరేష్ యాదవ్ కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేస్తం ఫౌండేషన్ సభ్యులు మణికంఠ,పవన్ బ్లడ్ బ్యాంక్ నరేష్, శేఖర్, తిప్పడంపల్లి యువకులు పెద్దలు పాల్గొన్నారు.
Also Read : వాల్మీకులు రాజకీయంగా ఎదగాలి
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube