టీ మీడియా, నవంబర్ 30, మహానంది:
మహానంది మండలం బొల్లవరం గ్రామంలో కొత్త వేరియంట్ పై ఎస్ఐ నాగార్జున్ రెడ్డి గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
కరోనా వైరస్ కొత్త రూపం దాల్చి వ్యాపిస్తుందని ప్రజలు దీనిని గుర్తించి దూరం పాటించడంతో పాటు ప్రతి ఒక్కరూమాస్కులు ధరించాలి సూచించారు.
గుంపులు గుంపులుగా ఉండరాదని కోరారు గత రెండు సంవత్సరాల నుంచి కరోనా వైరస్ గురించి పలువురు మృతి చెందిన విషయాన్ని గుర్తు చేశారు.
గ్రామస్తులతో పాటు మండల ప్రజలు సహకరించి తమతో పాటు ఇతరులను వైరస్ బారిన పడకుండా కాపాడుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మహనంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.