మెరిసిన పేదింటి కుసుమం 

0
TMedia (Telugu News) :

మెరిసిన పేదింటి కుసుమం

-సన్మానించిన ఎంపీపీ                                                                                                                            టి మీడియా ,ఆగస్టు 7, అడ్డాకుల: ఎస్ఐ ఫలితాలలో బలిజపల్లి గ్రామానికి చెందిన, వెంకటేశ్వరమ్మ, వెంకటేష్, ( పంచాయతీ డ్రైవర్ ) యొక్క కూతురును సన్మనించిన ఎంపీపీ నాగార్జున రెడ్డి. అడ్డకల్ మండలం బి.తారక యాదవ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎస్ ఐ ఫలితాలలో, సివిల్ కేటగిరి జోన్ 7 జోగులంబ పరిధిలో జనరల్ ఉమెన్స్ కేటగిరీలో మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించడం జరిగింది.పేద కుటుంబం లో పుట్టి గొప్పగా చదివి తల్లి దండ్రులకు,కుటుంబ సభ్యులకు ఊరికి,మండలానికి పేరు తెచ్చిన తారక యాదవ్ ను అడ్డకల్ ఎంపీపీ నాగార్జున రెడ్డి, పి ఏ సి ఎస్ అధ్యక్షులు జితేందర్ రెడ్డి, జిల్లా జడ్పీ కో ఆప్షన్ మహిమూద్ శాలువతో సన్మానించి అభినందించడం జరిగింది.

also read :దేవాలయం గుట్ట కు నిప్పు

చదువులో తారక ను ప్రోస్సహించిన తల్లిదండ్రులను శాలువతో కూడా సన్మనించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల నాయకులతో పాటుగా స్థానిక సర్పంచ్ పద్మ నర్సింహ, కన్మనూర్ సీనియర్ నాయకులు భీమ్ రెడ్డి, సింగిల్విండో డైరెక్టర్ రాజవర్ధన్ రెడ్డి, భీమన్న యాదవ్, గురు భాస్కర్ రెడ్డి, కుటుంబ సభ్యులు, వేణు యాదవ్, శ్రీధర్ యాదవ్, వార్డు మెంబర్ బాలకృష్ణ, శ్రీకాంత్, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube