యాదగిరిగుట్టలో కుప్పకూలిన భవనం.. నలుగురు మృతి
టీ మీడియా, ఏప్రిల్ 30,యాదాద్రి భువనగిరి : జిల్లాలోని యాదగిరిగుట్టలో శుక్రవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఓ పాత భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పలువురికి గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
also Read : వైసిపి గ్రామ అధ్యక్షుడి ని చంపిన స్వపక్షియులు
భవనం శిథిలాల్లో మరికొందరు చిక్కుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కూలిన రెండంతస్తుల భవనం 35 ఏండ్ల క్రితం నిర్మించినట్లు స్థానికులు తెలిపారు. మృతులను యాదగిరిగుట్టకు చెందిన దశరథ్ గౌడ్, శ్రీను, ఉపేందర్, శ్రీనాథ్ గా పోలీసులు గుర్తించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube