ప్రభుత్వ లోపం వల్లే బస్సు ప్రమాదం

ప్రభుత్వ లోపం వల్లే బస్సు ప్రమాదం

0
TMedia (Telugu News) :

ప్రభుత్వ లోపం వల్లే బస్సు ప్రమాదం

– నారా లోకేష్​

టీ మీడియా, నవంబర్ 6, విజయవాడ : ప్రభుత్వ లోపం వల్లే విజయవాడ బస్​స్టాండ్​లో బస్సు ప్రమాదం జరిగిందని నారా లోకేష్​ పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి వైసీపీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉందని అన్నారు. కాలం చెల్లిన బస్సుల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని… వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కొత్త బస్సు కూడా కొనలేదని లోకేశ్ విమర్శించారు. ఆర్టీసీ గ్యారేజీల్లో నట్లు, బోల్టుల కొనుగోళ్లకు కూడా ఈ నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని దుయ్యబట్టారు. రిక్రూట్ మెంట్ కూడా లేకపోవడంతో ఆర్టీసి సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. ప్రభుత్వం వారికి ఆదుకొని మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

Also Read : విజయవాడ బస్టాండ్‌లో ప్రమాదం..

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube