వరంగల్లో రూ.30 కోట్లతో వ్యాపారి పరార్..
టి మీడియా,మే 2 ,వరంగల్ : జిల్లాలో మరో ఘరానా మోసం చోటు చేసుకుంది. వరంగల్ లేబర్కాలనీ టీఆర్టీ కాలనీలో ఒక చిట్టీల నిర్వాహకుడు సుమారు రూ. 30 కోట్లతో ఉడాయించాడు. గత దశాబ్దాకాలంగా కాలనీలో మూడెడ్ల వెంకటేశ్వర్లు చిట్టీలను నిర్వహిస్తూ స్థానికులను నమ్మించాడు. కల్పవల్లి అసోసియేట్స్ పేరుతో ఒక కంపెనీ ప్రారంభించాడు. చిట్టీల నిర్వహణ సక్రమంగా ఉండడంతో పలువురు వడ్డీ ఆశతో రూ.లక్షలు ఆయనకు ఇచ్చారు.కొద్ది కాలంగా చిట్టీలు ఎత్తుకున్న వారికి, డిపాజిట్ దారులకు డబ్బులు ఇవ్వడం ఆలస్యం కావడంతో బాధితులు ఆయన ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు.
Also Read : రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తజనం..
ఇటీవల డబ్బుల కోసం నిలదీయడంతో కంపెనీ లాస్లో ఉందనే సమాచారాన్ని వెంకటేశ్వర్లు సభ్యులకు చేరవేశాడు.ఈ విషయం తెలియడంతో సభ్యులు అతడి ఇంటికి వెళ్లారు. మూడు రోజుల క్రితం దేవుని దర్శనానికి వెళ్తున్నట్లు స్థానికంగా చెప్పి ఏపీకి వెళ్లాడు. అక్కడ నుంచి సభ్యులందరికి ఐపీ నోటీసులు పంపాడు. దీంతో బాధితులు లేబర్ కాలనీలో ఉన్న అతని ఆఫీసు ముందు ఆందోళన చేపట్టారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube