జిల్లెళ్ళముడి గురవయ్ ను ఘనంగా సన్మానించిన డాక్టర్ కోట రాంబాబు
జిల్లెళ్ళముడి గురవయ్ ను ఘనంగా సన్మానించిన డాక్టర్ కోట రాంబాబు
జిల్లెళ్ళముడి గురవయ్ ను ఘనంగా సన్మానించిన డాక్టర్ కోట రాంబాబు
టీ మీడియా, మార్చి14, మధిర:
మధిర మండలం కృష్ణాపురం గ్రామంలో ఉన్న బీసీ వెల్ఫేర్ బాలుర పాటశాల నందు గత నాలుగున్నర సవత్సరాలు నుండి స్పెషల్ ఆఫీసర్ గా సేవలు అందించి వెళ్ళిపోతున్న జిల్లెళ్ళముడి గురవయ్య ను కెవిఆర్ హాస్పిటల్ అధినేత టీఆరెఎస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ కోట రాంబాబు ఘనంగా సన్మానించారు.
Also Read : ఐ ఎన్ టి ఎస్ ఓ పరీక్ష ఫలితాలలో శ్రీ చైతన్య విజయదుందుభి
ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ.. గురవయ్య చాలా మంచి వ్యక్తి అని, నిరంతరం విద్యార్థుల భవిష్యత్తు గురించి పరితపించే మంచి ఉపాధ్యాయులు అని అన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కు బంగారు బాటలు వేస్తూ వారు అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని నిత్యం పరితపిస్తూ ఎంతో మంది విద్యార్థుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు అని ఆయనను కొనియాడారు. ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ అనేది తప్పదు ఆ పదవీ విరమణ అనంతర గురవయ్య జీవితం ఆయురారోగ్యాలతో సంతోషంగా వుండాలి అని ఈ సందర్భంగా ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube