చంద్రబాబు ముందస్తు బెయిల్ విచారణ వాయిదా
టీ మీడియా, నవంబర్ 7, అమరావతి : రాజధాని ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం ఈ నెల 22కి వాయిదా వేసింది. అప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయకూడదని సీఐడీని ఆదేశించింది. మరోవైపు వాదనల సందర్భంగా ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ… స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై ఉన్నారని ఆ గడువు ముగిసేంత వరకు ఆయనను అరెస్ట్ చేయబోమని కోర్టుకు తెలిపారు. మధ్యంతర బెయిల్ స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పారు. బాబుపై తొందరపాటు చర్యలు తీసుకోబోమని తెలిపారు. ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన హైకోర్టు అరెస్ట్ చేయవద్దని ఆదేశిస్తూ తదుపరి విచారణను 22కి వాయిదా వేసింది.
Also Read : సుప్రీంకోర్టుకు ముగ్గురు జడ్జీలను సిఫారసు చేసిన కొలీజియం
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube