చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ
-నవంబర్ 1 వరకు రిమాండ్ పొడిగింపు
టీ మీడియా, అక్టోబర్ 19, విజయవాడ : టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో మరో ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు నాయుడు రిమాండ్ను నవంబర్ 1 వరకు పొడిగించింది విజయవాడ ఏసీబీ కోర్టు. ఇకపోతే స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు నాయుడు రిమాండ్ను పొడిగించాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను విజయవాడ ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడును వర్చువల్గా ఏసీబీ న్యాయమూర్తి విచారించారు. అనంతరం చంద్రబాబు నాయుడు రిమాండ్ను పొడిగించింది. నవంబర్ ఒకటి వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్లు విజయవాడ ఏసీబీ కోర్టు తెలిపింది.హొఈ క్రమంలో జైలులో తన సెక్యూరిటీ విషయంలో పలు అనుమానాలు ఉన్నాయని చంద్రబాబు కోర్టుకు తెలిపారు.దీంతో భద్రత విషయంలో ఎలాంటి అనుమానాలు ఉన్నా లిఖితపూర్వకంగా అందించాలని కోర్టు ఆయనకు సూచించింది.
Also Read : మహిళలకు సౌభాగ్య లక్ష్మి పథకం
వాటిని వివరిస్తూ జైలు నుంచి లేఖ రాయాలని జడ్జి చెప్పారు. ఆ లేఖను తనకు అందజేయాలని జైలు అధికారులను ఆదేశించారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో దాఖలైన పిటిషన్ల నేపథ్యంలో జడ్జి స్పందించారు. చంద్రబాబు ఆరోగ్యంపై అధికారులను ఆరా తీశారు. ఆయన మెడికల్ రిపోర్టులు కోర్టుకు అందజేయాలని ఆదేశించారు. చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube