నీకు తోడుగా నేనున్నా…
టీ మీడియా,మార్చి 10,వన పర్తి:
వీరిద్దరూ భార్యాభర్తలు.. జీవితాంతం తోడునీడగా ఉంటామని బాస చేసినట్లే జీవిత చరమాంకంలోనూ మెలగుతున్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రానికి చెందిన మన్యం, మాసమ్మ దంపతులు. వీరిలో మాసమ్మ అయిదేళ్ల నుంచి నడుమునొప్పితో బాధపడుతోంది. ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడంతో పాటు కాస్త దూరం కూడా నడవలేని పరిస్థితి ఆమెది.
వైద్యులను కలిసి సదరం ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని బుధవారం స్వగ్రామం నుంచి జిల్లా కేంద్రంలోని పాతబస్టాండు వరకు షేర్ ఆటోలో వచ్చారు. అక్కడి నుంచి జిల్లా ఆసుపత్రి వరకు మరో ఆటోలో వచ్చే స్థోమత లేక దాదాపు 200 మీటర్ల దూరం వరకు భార్యను మన్యం ఇలా మోసుకుంటూ వచ్చారు. తీరా సదరం శిబిరం వద్దకు వెళితే నడుము సంబంధిత ధ్రువీకరణ పత్రం జారీచేసే వైద్యుడు లేరని.. మళ్లీ రావాలని వృద్ధ దంపతులను వెనక్కిపంపారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube