9న సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నామినేషన్
– నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
– భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని
టీ మీడియా, నవంబర్ 7, మధిర : మధిర అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈనెల తొమ్మిదో తారీఖున 11 గంటల 45 నిమిషాలకు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నామినేషన్ వేనున్నట్లు అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క యువత సూర్య విక్రమాదిత్య, మండల పట్టణ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్, మిరియాల వెంకటరమణ గుప్త తెలిపారు. భట్టి క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 9న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నామినేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఉదయం తొమ్మిది గంటలకి కార్యకర్తలందరూ క్యాంప్ కార్యాలయానికి రావాలని సూచించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి నామినేషన్ కార్యక్రమం విజయవంతం చేయడం జరుగుతుంది అన్నారు.
Also Read : ఉత్తమ్ దంపతుల గెలుపు కోసం చర్చి లో ప్రత్యేక ప్రార్థనలు.
సాయంత్రం నాలుగు గంటలకు పివిఆర్ కళ్యాణమండపం ఎదురుగా ఇందిరాగాంధీ సభా ప్రాంగణం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వారితోపాటు కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube