టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లను ప్రారంభించిన సీఎం జగన్.

టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లను ప్రారంభించిన సీఎం జగన్.

0
TMedia (Telugu News) :

టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లను ప్రారంభించిన సీఎం జగన్.

టీ మీడియా,ఫిబ్రవరి 14,తాడేపల్లి : పర్యాటకుల భద్రతే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పర్యాటక ప్రదేశాల్లో టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 26 ​టూరిస్ట్ పోలీసు స్టేషన్‌లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారుఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో మరో మంచి కార్యక్రయం చేపట్టినట్లు తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. పోలీసులు మీ స్నేహితులే అనే భావనను తీసుకురాగలిగామని, ఇంతకుముందు జరగని రీతిలో పోలీస్‌ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. పోలీస్‌ స్టేషన్లలో రిసెప్షనిస్టులు పెట్టి తోడుగా నిలిచే కార్యక్రమం చేపట్టామని అన్నారు.

Also Read : ఈ లక్షణాలు కనిపిస్తే మెగ్నీషియం లోపం ఉన్నట్లే..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube