సీఎం కేసీఆర్ పాలన దేశానికే దిక్సూచి : మంత్రి సత్యవతి రాథోడ్
సీఎం కేసీఆర్ పాలన దేశానికే దిక్సూచి : మంత్రి సత్యవతి రాథోడ్
సీఎం కేసీఆర్ పాలన దేశానికే దిక్సూచి : మంత్రి సత్యవతి రాథోడ్
టీ మీడియా, డిసెంబర్ 6, మహబూబాబాద్ : అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ, అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా దేశానికే దిక్సూచిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కొనసాగుతుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనలు అత్యంత ఆదర్శనీయమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన ఆశయాలను అమలు చేస్తూ నిజమైన అంబేద్కర్ వాదిగా రాష్ట్రంలో పాలన చేస్తున్నారన్నారని కొనియాడారు. రాష్ట్రంలోని నూతన సచివాలయానికి ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం’ గా అని పేరు పెట్టి దళితులపై ఉన్న ప్రేమను మరోసారి చాటిచెప్పారని వెల్లడించారు.
Also Read : ఫస్ట్ వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్.. డేంజర్ బెల్స్ మోగిస్తున్న అడివి శేష్
దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర రాజధానిలో త్వరలో ప్రారంభించుకో బోతున్నామని వివరించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కుమారి అంగోత్ బిందు, సంజీవ , కిషన్,ఆర్డీవో కొమురయ్య, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube