స్కూళ్లు, ఆరోగ్య కేంద్రాలను పరిశీలించిన తమిళనాడు సీఎం స్టాలిన్
స్కూళ్లు, ఆరోగ్య కేంద్రాలను పరిశీలించిన తమిళనాడు సీఎం స్టాలిన్
స్కూళ్లు, ఆరోగ్య కేంద్రాలను పరిశీలించిన తమిళనాడు సీఎం స్టాలిన్
టీ మీడియా,ఏప్రిల్1,న్యూఢిల్లీ: ఢిల్లీలో పర్యటిస్తున్న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో కలిసి ఢిల్లీ ప్రభుత్వ స్కూళ్లు, ఆరోగ్య కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. స్కూళ్లలోని సౌకర్యాలపై ఆరా తీశారు. అలాగే మొహల్లా క్లినిక్లోని వైద్యులతో సీఎం ఎంకే స్టాలిన్ మాట్లాడారు. వాటి పని తీరును అడిగి తెలుసుకున్నారు.కాగా, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఢిల్లీలోని తమ పాఠశాలలు, మొహల్లా క్లినిక్లను సందర్శించేందుకు వచ్చారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. తమ స్కూళ్లు, ఆరోగ్య కేంద్రాలను ఆయన సందర్శించడం తాము గౌరవంగా భావిస్తున్నామని అన్నారు.
Also Read : డిసిపి ఇన్చార్జి పోలీస్ అధికారి కి స్వాగతం
మరోవైపు తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం కూడా విద్య, ఆరోగ్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం ఎంకే స్టాలిన్ మీడియాతో అన్నారు. తమ రాష్ట్రంలో స్కూళ్లను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. మోడల్ స్కూళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం తప్పకుండా పాల్గొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజల తరుఫున అరవింద్ కేజ్రీవాల్ను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube