కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై రూ.135 తగ్గింపు
కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై రూ.135 తగ్గింపు
కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై రూ.135 తగ్గింపు
టి మీడియా, జూన్1,న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇవాళ ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధరను తగ్గించాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్పై రూ.135 తగ్గించారు. జూన్ ఒకటో తేదీ నుంచి ఈ ధర అమలులోకి రానున్నది. మార్కెట్లో ఇప్పుడు 19 కేజీల సిలిండర్ రూ.2219కు లభించనున్నది. నిన్నటి వరకు ఈ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.2354గా ఉండేది.
Also read : వేడి తట్టుకోలేకపోతున్నా
మే 19వ తేదీన డొమెస్టిక్, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను చివరిసారి పెంచిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ప్రకటించిన కొత్త రేట్లలో డొమెస్టిక్ సిలిండర్ ధరను మార్చలేదు. కమర్షియల్ సిలిండర్ కోల్కతాలో రూ.2322, ముంబైలో రూ.2171, చెన్నైలో రూ.2373కు లభించనున్నది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ ధరలను నెలలో రెండుసార్లు ప్రకటిస్తారు. ఒకసారి నెల ఆరంభంలో, ఆ తర్వాత నెల మధ్యలో కొత్త ధరలను వెల్లడించే విషయం తెలిసిందే.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube