కేంద్రం ప్రభుత్వం దిష్టి బొమ్మ దగ్ధం
టీ మీడియా మార్చి 29 అశ్వారావుపేట :కేంద్ర బడ్జెట్ లో కార్మిక, కర్షక రంగాలకు తక్కువ నిధులు కేటాయించి,ఈ రంగాలను కార్పోరేట్ లకు అప్పగించేందుకేనని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పిట్టల అర్జున్ అన్నారు.మంగళవారం సార్వత్రిక సమ్మె రెండవ రోజు చేరుకుంది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల కు కనీస వేతనం రూ 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.సమ్మె నిర్వహిస్తున్న శిబిరం వద్దకు మంగళవారం సిపిఎం నాయకులు కొక్కెర పాటి పుల్లయ్య, సిపిఐ నాయకులు సయ్యిద్ సలీం,సిపిఐ యం, యల్ పార్టీ నాయకులు ప్రభాకర్ సమ్మెకు సంఘీభావం తెలిపి కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు.అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.సమస్యలతొ కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ ఐ కృష్ణ కు అందజేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు అప్పన్న, కామేశ్వరరావు, నందు, భూషణం,రాధ, భారతి,షహినా, యామిని, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.
Also Read : విశాఖ స్టీల్ను ప్రైవేటీకరణ చేయవద్దని.. మొత్తుకున్నాచెవికెక్కదా?
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube