పితృప‌క్షం స‌మ‌యంలో కలలో మీ పూర్వీకులు కనిపిస్తే.?

పితృప‌క్షం స‌మ‌యంలో కలలో మీ పూర్వీకులు కనిపిస్తే.?

0
TMedia (Telugu News) :

పితృప‌క్షం స‌మ‌యంలో కలలో మీ పూర్వీకులు కనిపిస్తే.?

లహరి, అక్టోబర్ 7, కల్చరల్ : పితృ పక్షం సమయంలో పూర్వీకుల ఆత్మ శాంతి కోసం అనేక కార్య‌క్ర‌మాలు చేస్తుంటారు. ఈ సంవత్సరం పితృ పక్షం సెప్టెంబరు 30 నుంచి ప్రారంభమయింది. పితృ పక్షంలో పూర్వీకులకు శ్రాద్ధం, తర్పణం, పిండ ప్ర‌దానం చేయడం మంచిదని భావిస్తారు. పితృ పక్షం సమయంలో పూర్వీకులు భూమికి వస్తారని నమ్ముతారు. అయితే పితృ పక్షం సమయంలో మీ పూర్వీకుల గురించి కలలు వస్తే అవి దేనికి సూచన…

కలలో పూర్వీకులు :
పితృ పక్షం సమయంలో, మీ పూర్వీకులు మీ కలలో మీ వైపు చేతులు చాచినట్లు మీరు చూస్తే, ఇది చాలా శుభ సంకేతమని మీరు అర్థం చేసుకోవాలి. అంటే పితరులు మీ పట్ల సంతుష్టులయ్యారని సంకేతం. మీరు మీ జీవితంలో సమస్యలు, ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే అవన్నీ త్వరలో ముగుస్తాయని అర్థం.

Also Read : స‌హ‌నం కోల్పొయిన హోం మంత్రి

పూర్వీకులు ప్ర‌శాంతంగా క‌నిపిస్తే :
మీ పూర్వీకులు మీ కలలో నిశ్శబ్దంగా కనిపిస్తే, వారు మీ కుటుంబం, వైవాహిక జీవితంలో ఆనందంతో పాటు శాంతిని కోరుకుంటున్నారని అర్థం. అటువంటి పరిస్థితిలో, పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి, మీరు పితృ పక్షంలో వారికి శాస్త్ర ప్ర‌కారం పూజలు, శ్రాద్ధం, తర్పణం, పిండ ప్ర‌దానం త‌ప్ప‌నిస‌రిగా చేయాలి.

కలలో మిఠాయి తినిపిస్తే :
పితృ పక్షం సమయంలో, మీ పూర్వీకులు కలలో క‌నిపించి మీకు మిఠాయి తినిపిస్తే, ఈ కల చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. మీ పూర్వీకులు మీతో సంతోషంగా ఉన్నారని, త్వరలోనే మీకు కొన్ని కొత్త శుభవార్తలు అందుతాయని దీని అర్థం.

కలలో మీ త‌ల దువ్వితే :
పితృ పక్షం సమయంలో, మీ పూర్వీకులు మీ తల వెంట్రుకలను దువ్వుతున్న‌ట్టు మీరు క‌ల‌గ‌న్న‌ట్ల‌యితే, వారు మీకు సంభవించే అన్ని కష్టాలు, దుఃఖాల నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తారని అర్థం చేసుకోండి. పితృ పక్షంలో ఇటువంటి కల చూడటం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు.

Also Read : తెలంగాణలో విద్యా వ్యవస్థ బలోపేతమయింది

పూర్వీకులు కలలో మాట్లాడితే :
కలలో మీ పూర్వీకులు మీతో మాట్లాడటం మీకు కనిపిస్తే, మీరు త్వరలో గొప్ప విజయాన్ని పొందుతారని అర్థం. ఇలాంటి కలలు కనడం వల్ల భవిష్యత్తులో మంచి విజయాలు వస్తాయని చెబుతారు. ఈ మహాలయ ప‌క్షంలో పూర్వీకులు త‌మవారి వద్దకు తిరిగి వ‌స్తార‌ని విశ్వసిస్తారు. అందుక‌ని వారిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రాద్ధకర్మలను ఆచ‌రించాలి. వారికి ఇష్టమైన వంటలు చేసి వారిని స్మరించుకుంటూ ఆవులు, కుక్కలు, కాకులకు పెడతారు. బ్రాహ్మణులకు, పేదలకు ఆహారం, వ‌స్త్రాలు దానం చేస్తారు. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషించి ఆశీర్వాదాలు ఇస్తారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube