కాంగ్రెస్ అస‌మ‌ర్థ‌త వ‌ల్లే క‌ర్ణాట‌క‌లో క‌రెంట్ క‌ష్టాలు

కాంగ్రెస్ అస‌మ‌ర్థ‌త వ‌ల్లే క‌ర్ణాట‌క‌లో క‌రెంట్ క‌ష్టాలు

0
TMedia (Telugu News) :

కాంగ్రెస్ అస‌మ‌ర్థ‌త వ‌ల్లే క‌ర్ణాట‌క‌లో క‌రెంట్ క‌ష్టాలు

– మంత్రి కేటీఆర్

టీ మీడియా, అక్టోబర్ 21, హైద‌రాబాద్ : కాంగ్రెస్ అస‌మ‌ర్థత వ‌ల్లే క‌ర్ణాట‌క‌లో క‌రెంట్ క‌ష్టాలు ఏర్ప‌డ్డాయ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం త‌గినంత విద్యుత్ స‌ర‌ఫ‌రా చేయ‌డంలో విఫ‌ల‌మైనందున, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్నార‌ని పేర్కొన్నారు. తెలంగాణ రైతుల‌కు కాంగ్రెస్ పార్టీ అస‌మ‌ర్థ‌త గురించి తెలుస‌ని, ద‌శాబ్దాలుగా ఆ బాధ‌లు ఎదుర్కొన్నార‌ని, ఇప్పుడు క‌ర్ణాట‌క‌లో రైతులు ఆ బాధ‌లు అనుభ‌విస్తున్నార‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు. కర్నాటక ప్రభుత్వం రైతాంగానికి కరెంటు ఇవ్వడానికి నానా తంటాలు పడుతోంది. వ్యవసాయ రంగానికి సరిపడా విద్యుత్‌ సరఫరా చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని రైతులు మండిపడుతున్నారు. యాద్గిర్‌లో ఏడు గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో గురువారం విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో జిల్లాలో మిర్చి, పత్తి, ఎర్రజొన్న, వరి పంటలు చాలా వరకు దెబ్బతిన్నాయని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube