రైతు బీమా చెక్కు అందజేసిన దాసరి
టీ మీడియా, ఫిబ్రవరి 7, ఓదెల : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం రైతు చనిపోయిన తన కుటుంబాన్ని ఆదుకునేది బి ఆర్ ఎస్ ప్రభుత్వవమే దాసరి మనోహర్ రెడ్డి, గూడెం గ్రామానికి చెందిన ఒగ్గు కళాకారుడు, రైతు వీరముష్టి సంపత్ గత నెల ప్రమాద వశాత్తూ వ్యవసాయ పనులు నిర్వహిస్తుండగా విద్యుత్ షాక్ తో మరణించారు. రైతు బీమా ద్వారా మంజూరైన రూ.5లక్షల చెక్కును మృతుని భార్య స్వప్న కు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చేతుల మీదుగా అందించారు,అనంతరం దాసరి మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని కెసిఆర్ రైతు కుటుంబం నుంచి వచ్చినందుకు రైతు మరణించిన తన కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలని ముందుచూపుతో నిర్వహించే కార్యక్రమమే రైతు బీమా అని అన్నారు.
Also Read : పచ్చి మిర్చీని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలివే.
తెలంగాణలోని ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి అంటే అది కేసీఆర్ వల్లనే సాధ్యమైతుందని అన్నారు, ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేణుకా, దేవి, ఐ రెడ్డి వెంకట్ రెడ్డి, ఆకుల మహేందర్, కావటి రాజు యాదవ్, ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, ఆల రాజిరెడ్డి, శ్రీకాంత్ , గోవిందుల ఎల్లస్వామి తదితరులు ఉన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube