ఉపాధి హామీ పనులపై సమీక్ష
టీ మీడియా మార్చి 20,పెద్ద శంకరంపేట: మండలం లోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 12వ విడత సామాజిక తనకి ప్రజా వేదిక శనివారం నాడు పేట మండల ప్రజా పరిషత్ ఆవరణంలో నిర్వహించారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా నేపథ్యంలో జాతీయ ఉపాధి హామీ పనులు చేపట్టిన అభివృద్ధి పట్ల అవకతవకలను గుర్తించి పేట మండలంలో పలు గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి జిల్లా అధికారులకు నివేదిక అందించిన న తనిఖీ బృందం. దీనిపై జిల్లా అధికారులు స్పందిస్తూ అవకతవకలు ఉన్న గ్రామాలను గుర్తించి సంబంధిత అధికారులపై తగు చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పేట జడ్పిటిసి విజయరామరాజు పట్టణ గ్రామ సర్పంచ్ సత్యనారాయణ. పేట మండలం ఎంపీపీ జంగం శ్రీనివాస్. మండల ఇన్చార్జి ఎంపీడీవో రియాజుద్దీన్ .టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మురళి పంతులు పాల్గొన్నారు వివిధ గ్రామాల సర్పంచులు,కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Also Read : కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube