కోర్టు అనుమతితో శిశువును చంపాలనుకుంటున్నారా
– సీజేఐ చంద్రచూడ్
టీ మీడియా, అక్టోబర్ 12, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు లో గురువారం సీజే డీవై చంద్రచూడ్ ఓ కేసులో సీరియస్ అయ్యారు. 26 వారాల ప్రెగ్నెంట్ పెట్టుకున్న అభ్యర్థన కేసులో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రెగ్నెన్సీ తొలగించుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ పెట్టుకున్న రిక్వెస్ట్పై స్పందిస్తూ.. కోర్టు ఆర్డర్ ద్వారా పర్మిషన్ తీసుకుని శిశువును చంపాలనుకుంటున్నారా అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు. ఈ కేసులో శుక్రవారం మళ్లీ విచారణ చేపట్టనున్నారు. అబార్షన్ అపీల్ గురించి ఆ మహిళతో కేంద్రం తరపున లాయర్ మాట్లాడాలని సుప్రీంకోర్టు సూచించింది. సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్నది. 26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఓ మహిళా సుప్రీంలో పిటీషన్ వేసింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమె ఇప్పటికే డిప్రెషన్తో బాధపడుతున్నట్లు ఆ పిటీషన్లో పేర్కొన్నారు. మానసికంగా, ఆర్థికంగా మూడవ శిశువును పెంచే స్థితిలో తాను లేనట్లు ఆమె ఆ పిటీషన్లో తెలిపింది.
Also Read : నారా లోకేష్ బెయిల్ పిటిషన్ డిస్పోజ్
ఈ కేసులో అబార్షన్కు అనుమతి ఇస్తూ అక్టోబర్ 9వ తేదీన కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఎయిమ్స్ వైద్యుల బృందం మాత్రం అబార్షన్కు నిరాకరించారు. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం బుధవారం ఈ కేసులో భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసింది. దీంతో ఆ కేసును గురువారం సీజే చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం టేకప్ చేసింది. నేడు మళ్లీ తీర్పు ఇవ్వనున్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube