జనంలోకి జనసేన.. ఇంటింటికీ జనసేన కార్యక్రమం
– ఘనపూర్ మండల జనసేన అధ్యక్షుడు జి. గోపాల్
టీ మీడియా, అక్టోబర్ 11, వనపర్తి బ్యూరో : వనపర్తి నియోజకవర్గం ఘనపూర్ మండలకేంద్రంలో జనసేన పార్టీ వనపర్తి కోఆర్డినేటర్ ముకుంద నాయుడు ఆదేశాల మేరకు జనంలోకి జనసేన – ఇంటింటికీ జనసేన కార్యక్రమం చేపట్టినట్టు ఘనపూర్ మండల అధ్యక్షుడు జి. గోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘనపూర్ మండలకేంద్రంలో జనంలోకి జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను బలంగా తీసుకెళ్తూ రాజకీయంగా వెనుకబడిన వర్గాలకు అధికారం అందించే దిశగా అడుగులు వేస్తూ ముందుకు వచ్చిన మన సామాన్యుడి పార్టీగా అందరూ అండగా నిలవాల్సిన పరిస్థితీ వివరిస్తూ బలోపేతం చేస్తున్నామన్నారు. కొన్ని వర్గాలకే పరిమితమైన రాజకీయ వ్యవస్థను కొంత మందికే పరిమితమైన రాజకీయ పదవులను అన్ని పేద వర్గాలకి , ప్రజాసేవ ఆకాంక్ష వున్న మేధావులకు సామాన్య యువకులకు దక్కాలి అంటే జనసేన రావాలి అని పేర్కొన్నారు. అదే విధంగా రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ నూతన రాజకీయ వ్యవస్థ కొరకై బలంగా పోటీలో నిలుస్తుందని దానికి అనుగుణంగా ఘనపూర్ మండలం నుంచి అత్యధికంగా ప్రజలు ఓట్ల రూపంలో మార్పుకు శ్రీకారం చుట్టనున్నారు.
Also Read : ఏపీ హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులు
అని ఆ దిశగా అన్ని గ్రామాల్లో వార్డు స్థాయిలో విస్తరించేల ముందుకు వెళ్తున్నామని యువకులకు పెద్ద ఎత్తున రాజకీయ అవకాశం కల్పిస్తున్న పార్టీగా మద్దతుగా నిలవాలని వనపర్తి కోఆర్డినేటర్ ముకుంద నాయుడు ఆధ్వర్యంలో మరింత బలంగా పనిచేస్తామని గెలుపే లక్ష్యంగా జనంలోకి వెళ్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల అధ్యక్షులు జి. గోపాల్ నాయకులు మహేష్, కె.నర్సింహులు, సింగోటం, లక్ష్మీ నరసింహ, కె. గోపాల్, డి. నర్సింహులు, జీ.రాకేష్ , శివ, భీం రాజ్ తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube