భారీగా డ్రగ్స్ సీజ్..
-ముగ్గురు నిందితులు అరెస్ట్
టీ మీడియా, డిసెంబర్ 9, గువాహటి : ఈశాన్య రాష్ట్రం అసోంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మాదక ద్రవ్యాలను తరలిస్తున్నారన్న సమాచారం మేరకు అసోం పోలీసులు.. గురువారం రాత్రి కర్బి అంగ్లాంగ్ జిల్లాలో వాహనాలను తనిఖీ చేశారు.ఈ తనిఖీల్లో 30 వేల యాబా టాబ్లెట్లతోపాటు, రూ.7 కోట్ల విలువచేసే హెరాయిన్తో కూడిన 55 సోప్ కేసులు లభ్యమయ్యాయి. దాంతో పోలీసులు వాటిని సీజ్ చేశారు. ఈ డ్రగ్స్ను తరలిస్తూ దొరికిపోయిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube