కుదిపేసిన భూకంపం.. కుప్పకూలిన భవనాలు

95 మంది దుర్మరణం

0
TMedia (Telugu News) :

కుదిపేసిన భూకంపం.. కుప్పకూలిన భవనాలు..

– 95 మంది దుర్మరణం

టీ మీడియా, ఫిబ్రవరి 6, రియాద్‌ : భారీ భూకంపం టర్కీని కుదిపేసింది. గజియాన్టెప్‌ ప్రావిన్స్‌లోని నుర్దగీ సమీపంలో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదయిందని యూఎస్‌ జియోగ్రాఫికల్‌ సర్వీస్‌ వెల్లడించింది. సోమవారం ఉదయం 4.17 గంటలకు భూమికంపించిందని, నుర్దగీకి 26 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. భూమిలోపల 17.9 కిలోమీటర్ల లోతున భూకంపం వచ్చిందని తెలిపింది. భారీ భూకంపం ధాటికి పలు భవనాలు కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు అధికారులు, సిబ్బంది ప్రయత్నాలు ముమ్మరం చేశారు. భవనాలు కూలిపోవడంతో ఇప్పటివరకు సుమారు 95 మందివరకు మరణించినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. టర్కీకి ప్రధానమైన పారిశ్రామిక కేంద్రమైన గజియాన్టెప్‌.. సిరియా సరిహద్దుల్లో ఉన్నది. భూకంప ప్రభావతంతో లెబనాన్‌, సిరియా, సైప్రస్‌లో కూడా ప్రకంపనలు సంభవించాయి. సిరియాలోని పశ్చిమ తీరప్రాంతమైన లటకియాలో పలు భవనాలు నేలమట్టమయ్యాయి.కాగా, 1999లో టర్కీలో 7.4 తీవ్రతతో భూప్రకంపనలు నమోదయ్యాయి.

Also Read : కబడ్డీ పోటీలను విజయవంతం చేయండి

దీంతో 17వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఇస్తాంబుల్‌ నగరంలోనే వెయ్యి మందికిపైగా ప్రజలు మృతిచెందారు. ఇక 2020లో ఎలజిగ్​ ప్రాంతంలో 6.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంపం ధాటికి 40 మంది బలయ్యారు. గతేడాది అక్టోబర్‌లో 7.0 తీవ్రతతో వచ్చిన భూకంపంతో 114 మంది మరణించారు. మరో వెయ్యి మందికిపైగా ప్రజలు గాయపడ్డారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube