నేపాల్లో 5.6 తీవ్రతతో మరోసారి భారీ భూకంపం
– ఢిల్లీలో బలమైన భూ ప్రకంపనలు
టీ మీడియా, నవంబర్ 6, ఖాట్మాండ్ : హిమాలయ దేశం నేపాల్ ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. గత శుక్రవారం రాత్రి నేపాల్లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూ ప్రకంపనల కారణంగా సుమారు 150 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత శనివారం మధ్యాహ్నం కూడా మరోసారి 3.6 తీవ్రతతో భూమి కంపించింది. తాజాగా అక్కడ మరోసారి భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. సోమవారం సాయంత్రం 4:16 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 5.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. ఈ భూకంపం ధాటికి దేశరాజధాని ఢిల్లీలోనూ బలమైన భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కంపించింది.
Also Read : ప్రజల కోసమే తెలంగాణ ఎన్నికల్లో పాల్గొనలేదు
దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కార్యాలయాలు, ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. మూడు రోజుల్లో ఢిల్లీలో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం ఇది రెండో సారి. వరుస భూకంపాలతో ఢిల్లీ దాని పరిసర ప్రాంత వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube