గుజరాత్ను వణికించిన రెండు స్వల్ప భూకంపాలు..
టీ మీడియా, ఫిబ్రవరి 27, గుజరాత్ : గుజరాత్ రాష్ట్రాన్ని స్వల్ప భూకంపాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 3:21 గంటల ప్రాంతంలో 4.3 తీవ్రతతో రాజ్కోట్ ప్రాంతంలో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రాజ్కోట్ కు ఉత్తర వాయువ్యంగా 270 కిలోమీటర్ల దూరంలో, భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. కాగా, ఆ రాష్ట్రాన్ని సోమవారం ఉదయం మరో రెండు భూకంపాలు వణికించాయి.కచ్, అమ్రేలి ప్రాంతాల్లో సోమవారం ఉదయం భూ ప్రకంపనలు వచ్చాయి. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలు పై 3.8, 3.3 గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కచ్ జిల్లాలో ఉదయం 10.49 గంటల ప్రాంతంలో 3.8 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయి. లఖ్పట్ టౌన్ కు 62 కిలోమీటర్ల దూరంలో, 15 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు.
Also Read : అంబులెన్సు లో గర్భిణీ ప్రసవం
రెండోది అమ్రేలి జిల్లాలో ఈ తెల్లవారుజామున 1:42 గంటల ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది. మిటియాల గ్రామ సమీపంలో 7.1 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ భూకంపం ధాటికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అయితే, వరుస భూకంపాలతో గుజరాత్ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube