విద్యుత్ శాఖ అదనపు వసూలు విరమించుకోవాలి

విద్యుత్ శాఖ అదనపు వసూలు విరమించుకోవాలి

0
TMedia (Telugu News) :

విద్యుత్ శాఖ అదనపు వసూలు విరమించుకోవాలి

టీ మీడియా, జనవరి 31, బెల్లంపల్లి : తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ శాఖ వారు వినియోగదారులపై అడ్వాన్స్ కంజక్షన్ డిపాజిట్ ఎ.సి.డి డ్యూ పేరుతో అక్రమంగా అదనపు వసూలు విరమించుకోవాలని బెల్లంపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టీ మణి రామ్ సింగ్ డిమాండ్ చేశారు. ఏసీబీ పేరుతో పేద మధ్యతరగతి ప్రజలపై వేలకోట్ల రూపాయలు దండుకోవడం దుర్మార్గమని అన్నారు రైతాంగానికి 24 గంట లు ఉచితంగా కరెంటు ఇస్తామని చెప్పి అమలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. వెంటనే వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా కరెంటు ఇస్తామని చెప్పి అమలు చేయడంలో కెసిఆర్ ప్రభుత్వం విఫలమైందని వెంటనే వ్యవసాయా రంగానికి రైతాంగానికి ఉచితంగా 24 గంటలు కరెంటు ఇవ్వాలని అప్రకటిత కరెంటు కోతలు ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Also Read : హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొందాం

విద్యుత్తు రంగంలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఇప్పుడు ఏ సి డి బిల్లులను రద్దు చేయాలని లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి టిడిపి పట్టణ అధ్యక్షులు సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టి మణి రామ్ సింగ్ ఉపాధ్యక్షులు బొల్లు మల్లయ్య హరి కిషన్ పాండే దుగుట రవి గోగర్ల రాజశేఖర్ జి సదానందం సిహెచ్ రమేష్ జె కర్ణాకర్ ఏ తిరుపతి గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube